పుట:కాశీఖండము.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

433


ఫలము గడుదూర మైనఁ గోపంబు పుట్టి
కాశినగరంబు శపియింపఁ గాఁ దలంచె.

27


వ.

అప్పుడు ప్రత్యక్షంబై.

28


చ.

కహకహ నవ్వె దంష్ట్రి కలగల్ల మెఱుంగులు భానుదీప్తిసం
గ్రహముఁ దిరస్కరింప శతకంఠుఁ డకుంఠితరోషదీప్తుఁ డై
యహహ! దురాత్మ! కాశిపయి నల్గెదవే? యనుపల్కు పల్కి యా
గ్రహమున నేను డుంఠిగణరాజు నెదిర్చితి మమ్మునీంద్రునిన్.

29


వ.

అప్పుడు.

30


సీ.

నందిషేణువిలోచనముల నిప్పులు రాలె
        శూలంబు చేనందె సోమనంది
మృత్యు ప్రకంపను మే నెల్లఁ జెమరించె
        దండుఁ డాస్ఫోటించె ధరణి వగులఁ
గుంభోదరుండు భ్రూకుటి ఫాలమునఁ బూనె
        కోకిలాక్షుఁడు పండ్లు గొఱికికొనియె
అగ్నిజిహ్వుండు ఘోరాట్టహాసము సేసె
        గృత్తివాసుండు హుంకృతియొనర్చె


తే.

భృంగితండులు తాండవప్రియుఁడు రేగి
డమరుగంబులు వాయించి రమితపటిమ
రాజరేఖాధరుండు దుర్వాసుమీఁద
నలుగు టెఱిఁగి తదీయరోషానువృత్తి.

31


శా.

ఆభుగ్నభ్రుకుటీకరాళముఖులై యంగంబు లుప్పొంగ ద్యా
వాభూమ్యంతర మట్టహాసడమరుధ్వానంబులన బిట్టు సం
క్షోభింపం బ్రమథధ్వజిన్యధిపతు ల్కుంభోదరాదు ల్మహా
భూభృత్సన్నిభు లంఘ్రులన్ ధరణి యాస్ఫోటించి తాటించుచున్.

32