పుట:కాశీఖండము.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

421


యంతరిక్షంబున దవ్వు(గా) గొని చనియె నప్పుడు సేయునది లేక కాందిశీకత్వంబుకం జీకాకువడియు వివేకనిధి యైన పారావతి పారువంబుఁ దప్పక చూచి నయనసంజ్ఞం గాలుం గఱువు మని కదపిన.

297


ఉ.

శ్యేనము కాలివ్రేలు గఱిచెన్ దిట దప్పక పారువంబు లో
నూనిఁతీవ్రవేదనకు నోరువఁ జాలక చీత్క్రియాసుసం
ధానము పాదధూననముఁ దత్సమయంబునఁ జేసెఁ బత్రియా
మానముదూరి పాఱిఁ రసమానరయంబునఁ బక్షిదంపతుల్.

298


వ.

పాఱి యొక్కచోటంగూడి బలవద్విరోధంబునం జేసి గాశినుండ వెఱచి యయోధ్యానగరంబున సరయూతీరంబునం బెద్దకాలంబు మనువు మని యపరజన్మంబున మందరధారకుండను విద్యాధరుండును రత్నావళి యనునాగకన్యకయు నై జన్మించి జాతిస్మృతివశంబున నప్పారువంబులు రెండును దంపతు లై కాలక్రమంబునఁ గాశీత్రివిష్టపేశ్వరు సేవించి ముక్తులైరి. ఇది త్రివిష్టపేశ్వరమాహాత్మ్యంబు.

299


కేదారేశ్వరమాహాత్మ్యము

తే.

ఆదిఁ బరమేశ్వరుఁడు గౌరి కానతిచ్చి
నట్టిపరిపాటిఁ జెప్పెద ననఘ! నీకుఁ
గాశికేదార శంభులింగంబుమహిమ
సావధానత విసుము వింధ్యాద్రిదమన!

300


వ.

అనేకజన్మార్జితంబు లైన పాపంబులు గేదారేశ్వరస్మరణంబునం బాయు. సాయంప్రాతఃకాలంబులఁ గేదారేశ్వరస్మరణంబు సర్వదురితహరంబు.

301