షష్ఠాశ్వాసము
355
తే. | వర్ణములు నాశ్రమంబులు వరుసఁ దప్పె | 86 |
దివోదాసనిర్యాణము
వ. | అప్పుడు దివోదాసుండు డుంఠిభట్టారకుండు సెప్పిన విప్రుం డెప్పుడు వచ్చునోయని దివసంబులు లెక్క పెట్టుకొనుచుండం బదునెనిమిదవదివసంబున మధ్యాహ్నకాలంబునందు సుగతవేషధారి యగుమధుసూదనుండు బ్రాహ్మణవేషంబు దాల్చి యేతెంచి సముచితప్రకారంబున దివోదాసుం యాశీర్వదించి యతం డనుప సమున్నతకనకాసనంబునఁ గూర్చుండె. ఆవేళ విఘ్నేశ్వరుఁడు రాజహృదయంబునందు నావేశరూపంబున నధివసించె. వినాయకాధిష్ఠితుండై భూపతి వైరాగ్యంబు వహించి కపటబ్రాహ్మణున కిట్లనియె. | 87 |
ఆ. | బడలుపడితి రాజ్యభారంబు భరియించి | 88 |
వ. | తపస్సామర్థ్యంబునం బజ్జన్యాగ్న్యనిలాత్మకుండ నైతి. ప్రజ లౌరసు లైనపుత్రులుం బోలెఁ బరిపాలింపంబడిరి. దేవతలం దృణీకరించిన యొక్కయపరాధంబునుం దక్క నాయందు గానవచ్చినయపకారం బొందు లేదు. నాభాగ్యంబున నీవు హితోపదేశంబు సేయ నాచార్యుండునుం బోలె నేగుదెంచితి. ఇంతకాలంబు నారాజ్యంబున నకాలమరణంబును | |
- ↑ శైవపక్షంబు కృష్ణపక్షంబు చెడియె