పుట:కాశీఖండము.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

354

శ్రీకాశీఖండము


యౌవనంబులు పోయెనా రావు క్రమ్మఱ
సపరిక్షయమ్ములు సంచయములు
తే. గడచినప్పుడు క్రిము లొండెఁ గాకు లొండెఁ
గుక్క లొండేనియును భుక్తిఁ గొనెడు దేహ
మొకఁడు బార్ధించి నప్పుడ యొసఁగవలదె!
తన్ను నిచ్చుటయది గదా దానగుణము.

83


వ.

వావి వర్ణంబు విచారింప వలదు. వృద్ధాచారంబు విచారించి చూచిన బ్రహ్మపుత్రులు గదా దక్షుండును మరీచియు. మరీచినందనుం డైనకశ్యపుండు ధర్మమార్గంబునం దక్షుని కన్యకలఁ బదుమువ్వుర నెట్టు వివాహంబయ్యె? ఇదానీంతనులు మర్త్యు లల్పబుదు లల్పపరాక్రములు గావున నిది గమ్య యిది యగమ్య యని విచారంబు సేయుచున్నవారు. పరమపురుషునిముఖబాహూరుపాదంబులం జాతుర్వర్ణ్యంబు జన్మించె. ఒక్క తనువునందుఁ బుట్టిన నలువు రేకోదరు లౌదురో కారో? అట్టివారికి భిన్నవర్ణత్వం బెట్టు సిద్ధించుచున్నయది? కావున వర్ణావర్ణవివేకంబు విడిచి వలసినట్టు పురంధ్రీపురుషులు విహరించునది యని పెక్కుప్రకారంబుల విజ్ఞానకౌముది సౌగతశాస్త్రంబు వక్కాణింప విని పురాంగనలు భర్తృశుశ్రూషాదిధర్మంబు లుజ్జగించి రయ్య వసరంబున.

84


చ.

వననిధికన్యయున్ హరియు వాడల వాడల బౌద్ధధర్మముల్
జినమతముల్ నిరంతరముఁ జెప్పఁగఁ జెప్పఁగఁ గాశికాపురిన్
దనతనధర్తముల్ విడిచి తామరసాయతలోచనాజనం
బును పురుషప్రతానమును బూనెను బుద్ధజినవ్రతంబులన్.

85