పుట:కాశీఖండము.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

335


ననవు డాపిచ్చుకుం టమ్మతో నిట్లను
        నేనూఱువర్షంబు లేగునంత
మూఁడవయీయండమున నుద్భవించిన
        తనయుండు తల్లి! నీదాస్య ముడుపు


తే.

నేమరక దీని రక్షింపు మీవు నియతి
ననుచు బుద్ధులు చెప్పి యయ్యరుణుఁ డరిగె
జననియనుమతిఁ గాశికాస్థానమునకుఁ
దారకబహ్మవిద్యానిధానమునకు.

23


వ.

ఆశాపంబు కారణంబుగా నొక్కనాఁడు కద్రూవినతలు సముద్రతీరంబున వినోదార్థంబు విహరించువారు వేలానువన(ధి)వనప్రాంతంబున మరుత్వంతునితురంగం బుచ్చైశ్శ్రవంబు మేయుచున్నం గనుంగొని వినత ‘యోహో! యీహయోత్తమం బింత యొప్పునే! మహాపురుషునికీర్తిపూరంబునుం బోలెఁ గార్తికచంద్రచంద్రికాధవళం బయియున్న యది’ యనినఁ గద్రువ యేకన్నులఁ గనుఁగొంటివి? ఈ తురంగంబునందు నిందుబింబంబునందుఁ గందునుం బోలె వాలవీధియందు వాలంబు లొకకొన్ని నీలంబు లయియున్నయవి యని పలికె. ఉన్నయవియనియును లేవనియునుం గొంతతడ విద్దఱు వాదంబు సేసి దాస్యంబు పణంబుగాఁ బన్నిదంబు చఱచిరి. అప్ప్రొద్దునకుం బ్రొద్దు చాలమి నిజనివాసంబుల కరిగిరి. మఱునాడు ప్రాతఃకాలంబునఁ గద్రువ గొడుకులం బిలిచి పనిచినం గొంద ఱక్కార్యంబునకు సమ్మతింపక కినుకం బడిరి. కొందఱు వాలమాత్రసూక్ష్మాకారులై వహించి వాలంబునందు వ్రేలిరి. అంతఁ దత్పరీక్షణంబునం వినత యోటువడి