పుట:కాశీఖండము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 21

తే. నేమి విరిసినకతన నన్నేలనెలవు
నైమిశంబయ్యె నదియ తా నైమిశంబుఁ
దన్మహాపుణ్యవనమున ద్వాదశాబ్ది
సత్త్రయాగంబుఁ గావించె శౌనకుండు. 77

వ. ఆసత్త్రయాగంబునందు శౌనకాదిమహామునులును సూతాన్వయసంభవుం డైనసూతు నర్చించి తన్ముఖంబునం బురాణేతిహాససంహితలు వినిరి గావున నమ్మహావిద్యాస్థానంబు సూతముని సంవాదాత్మకంబు. 78

తే. స్కాందమందుల నేఁబదిఖండములకు
బహుకథాసంగతులు సేయ బాడి గాదు
ఖండఖండంబులందును గలిగినట్టి
కథలపాలివి సంగతిగ్రహణమునకు. 79

వ. ఇమ్మహాస్కాందమ్మునకు నవయవంబు లాఱుసంహిత లవి క్రమంబున సనత్కుమారసంహిత పంచపంచాశత్సహస్రిక, సూతసంహిత షట్సహస్రిక, శాంకరసహిత త్రింశత్సహస్రిక, వైష్ణవసంహిత పంచసహస్రిక, బ్రహ్మసంహిత త్రిసహస్రిక, సౌరసంహిత యేకసహస్రిక. ఈసంహితలయందుఁ (బంచ)నాగరఖండంబు, గమలాలయాఖండంబు, రేవాఖండంబు, నేకవీరాఖండంబు, మైలారఖండంబు, గోదావరీఖండంబు నాదిగాఁగల పంచాశత్ఖండంబులందు. 80

కాశీఖండప్రశంస

శా. ప్రాశస్త్యంబు వహించు ద్వాదశసహస్రగ్రంథసంకౢప్తివి
శ్వేశక్షేత్రవియన్నదీపటుకడుంఠీనాథసత్కీర్తనో
ద్దేశప్రక్రమశోభితాద్భుతకథాధిషానమై శ్రేష్ఠమై