పుట:కాశీఖండము.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

శ్రీకాశీఖండము


తే.

వేల్పు లొనరించినట్టి దుర్వృత్తి యగుట
నెఱిఁగి యింతియ కాకయొం డేమి? యనుచు
నారగించె దివోదాసుఁ డర్కకిరణ
తాపపక్వంబు లగుపదార్థంబు లెలమి.

308


వ.

భోజనానంతరంబున నాస్థానమధ్యంబునం గొలువుండి దివోదాసుండు వాసవాదులు సేసిన యపకారంబునకుఁ బ్రతిగారంబు సింతించునవసరంబునఁ బౌరజానపదులగు జను లయ్యగ్నితిరోధానంబునకు భయంపడి యమ్మహోత్పాతంబు విన్నవింప నేతెంచిన.

309


ఉ.

అందఱ నాదరించి మిహిరాన్వయముఖ్యుఁడు వారియాత్మ లా
నందముఁ బొంద ని ట్లనియె నాకనివాసులు సేసినట్టికీ
డొందునె నన్ను? మీరు వెఱుకుండుఁడు భూప్రజలార! నేడ
యానందవనంబునందు దహనంబు ఘటించెద యోగసంపదన్.

310


మ.

అనుమానింపక యాసురాధములు మాయాకల్పనావంచనం
బున వైశ్వానరునిన్ హరించిరి యవుంబో! యింతమాత్రంబులో
నన నాయోగమహానుభావమునకున్ భంగంబ వాటిల్లునే!
సనెక ల్దాఁచినఁ బెండ్లి మానునొకొ! దుశ్చారిత్రము ల్గంటిరే!

311


సీ.

దహనస్వరూపంబుఁ దాల్చి యేఁ గైకొందు
        హవ్యకవ్యాహతు లధ్వరములఁ
బర్జన్యమూర్తిఁ జేపట్టి యే వర్షింతు
        సలిలధారలు సస్యములు ఫలింప
శశిదివాకరులవేషంబులుఁ దాల్చి యే
        ఖండింతు గాఢాంధకారపటలిఁ