20 శ్రీకాశీఖండము
జంద్రమౌళిప్రభావంబు సమధికముగ
శ్రుతులయట్ల [1]పురాణసంహితలు నడుచు. 73
తే. సరవి సర్గంబు నాఁ బ్రతిసర్గ మనఁగ
వరుసతో వంశవంశానుచరితము లనఁ
గ్రమపరిప్రాప్తి మన్వంతరము లనంగ
లలిఁ బురాణమునకు నైదు లక్షణములు. 74
తే. గ్రంథపరిసంఖ్య నాల్గులక్షలు పురాణ
మది చతుర్దశవిద్యలయందుఁ బెద్ద
చాలఁ గర్మార్థమం దానుషంగిక మన
యాదికారికయందె బ్రహ్మార్థగరిమ. 75
ఉ. అట్టి[2]దివోపురాణము మహత్త్వము సూతుఁడు దద్విదుండుగాఁ
బట్టి కనిష్ఠజన్మమునఁ బ్రాకృతుఁ డయ్యు నురుప్రభావులై
నట్టి మహామునీంద్రులకు నంబుజసంభవునంతవారికిన్
దిట్టతనంబు మీఱ నుపదేశ మొనర్చుచు నుండు బ్రహ్మమున్. 76
నైమికశబ్దనిర్వచనము
సీ. ఆది మనోమయం బగునొక్కచక్రంబుఁ
గల్పించె బ్రహ్మ జగద్ధితముగఁ
గల్పించి యాబండికలు డొల్చె సత్యలో
కంబుననుండి యాకమలగర్భుఁ
డది డొల్లగిలి విష్టపాంతరంబులు దాఁటి
క్రమముతో భూమిచక్రమున వ్రాలె
వ్రాలి రంహస్స్ఫూర్తి వచ్చి వచ్చి ధరిత్రి
నిమ్నోన్నతుల శీర్ణనేమి యయ్యె