పుట:కాశీఖండము.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

శ్రీకాశీఖండము


దంతనిర్మితయోగదండమండితులును
        ననిలభుగ్బ్రహ్మసూత్రాన్వితులును
నాసాశిఖాగ్రవిన్యస్తలోచనులును
        బంచాక్షరీమంత్రపఠనపరులు


తే.

నైనప్రమథులు గొలిచి రా నగజతోడ
నందికేశ్వరు నెక్కి యానందలీల
సకలజగదీశ్వరుండు పర్జన్యులీల
సుందరాద్రికిఁ గదలె సమగ్రమహిమ.

279


వ.

మఱియు సారస్వతేశ్వరుండు, రత్నజాతీశ్వరుండు, సప్తనాగరేశ్వరుండు, శైలేశ్వరుండు, త్రిపురేశ్వరుండు, బాణేశ్వరుండు, ప్రహ్లాదేశ్వరుండు, భృంగీశ్వరుండు మొదలైన పరమేశ్వరులు, దివ్యజ్యోతిర్లింగమూర్తులు, శతసహస్రలక్షకోట్యర్బుదన్యర్బుదసంఖ్యాకులు విశ్వేశ్వర శ్రీమన్ మహాదేవు ననుగమించిరి. లోలార్కకేశవులును, విశాలాక్షియు, డుంఠివిఘ్నేశ్వరుండును, దండపాణియుం గదలిరి. అందఱువేల్పు లిరుపక్కియలనుం బిఱుందనుం గూడి రాఁ గాశీశ్వరుండు.

280


సీ.

లవణపాథోధివేలావేష్టితంబైన
        యల్లొనేరెడుదీవి యధికరించి
యిక్షురసాబ్ధిపరీతాంచలంబైన
        ప్లక్షాంఘ్రిపద్వీపపరిధి గడచి
హాలాకసోదన్వదభిమంత్రితంబైన
        శాల్మలద్వీపభూస్థలము దాఁటి