పుట:కాశీఖండము.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

311


విశ్వేశ్వరాదేశంబున నెచ్చోటికైనను జనువారై గంగాతీరంబున విడిసిరి. కాశీశ్వరుండును నేకక్రియాఫలద్వయంబు నీఁజాలునట్టిప్రకారంబు విచారించి యటకుమున్న పెద్దకాలంబునం యవిముక్తక్షేత్రంబునందునుంబోలె నిజశిఖరదేశంబునం దా నధివసించుట ఫలంబుగాఁ గోరి తన్ను నుద్దేశించి ఘోరవీరతపంబు చేసినమందరాచలంబు కృతార్థం బగునట్లు నగ్గిరీంద్రంబునం దుండి దివోదాసు ప్రతిజ్ఞ చెల్లించువాఁడై తత్కాలసన్నిహితం బైన నానాదిగ్దేశదేవతాసమూహంబుఁ గనుంగొని యి ట్లనియె.

275


ఉ.

ఓసురముఖ్యులార! కమలోద్భవుఁ డాదర మొప్పఁగా దివో
దాసున కిచ్చినాఁడు వసుధాతల మెల్ల జగద్ధితార్థమై
రాసుతుఁ డాతఁ డీభువనరాజ్యభరంబు వహించునప్డు దే
వాసురసిద్ధసాధ్యగరుడాదుల వేల్పులఁ బన్నగేంద్రులన్.

276


తే.

ఆజ్ఞ వెట్టినఁ గాని రాజ్యంబు సేయ
బహుముఖం బైన రాజ్యంబు పదిలపడదు
ఫణులు పాతాళమున నుండఁ బాడివారు
నిర్జరులు నాకమందున నిల్చువారు.

277


వ.

అని వరంబు వేఁడినఁ బితామహుండును నాయనుమతి నతని కభీప్సితార్థంబు నొసంగె నని యానతిచ్చి.

278


సీ.

మహనీయరుద్రాక్షమాలికాభరణులు
        భస్మత్రిపుండకోద్భాసితులును
వికటపాటలజటామకుటవర్ధనులును
        సముదీర్ణశార్దూలచర్మధరులు