పుట:కాశీఖండము.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

శ్రీకాశీఖండము


నంబు, సుఖాసనం బన బహుభేదంబులం గలిగియుండు. ఇం దొక్కయాసనంబున నాసీనుండై యోగి యోగం బభ్యసించునది. దంశమశకాకీర్ణంబు గాక, కేశభస్మాంగారకీకసాదిప్రదూషితంబు గాక, జనసంకులంబు గాక, సర్వబాధావిరహితంబై సర్వేంద్రియసుఖావహంబై మనఃప్రసాదజననంబై కుసుమస్రగ్వాసనాధూపధూమమేదురంబైన ప్రదేశంబున నతితృప్తుండును, నతిక్షుధార్తుండును, విణ్మూత్రబాధితుండును, జింతాకులుండును గాక, నిమీలితాక్షుండై దంతంబులు దంతంబులం గూర్పక యింద్రియగ్రామంబు నియమించి ప్రాణాయామంబున కుపక్రమించునది.

234


తే.

యోగి యొయ్యయ్య మరగించి యునుపవలయుఁ
గుక్షిగోళంబులో గాలి కుంభకమున
బలిమి నిలిపిన రోమకూపముల వెడలి
యవే ప్రకల్పించుఁ గుష్టాదు లైనరుజల.

235


ఉ.

ఎంతయు ఘోరమైన విపినేభము మెల్లన మస్తరించి మా
వంతుఁడు కంఠపీఠి గుఱివైచి సుఖంబున నెక్కునట్టు ల
శ్రాంతము యోగసాధకుఁడు ప్రాణసమీరణముల్ నిసర్గదు
ర్దాంతము మ(కు)స్తరించి యవధానము మై ధరియింపఁగాఁదగున్.

236


తే.

కడఁగి సవ్యాపసవ్యమార్గముల వెలికి
యాన మొనరించుఁ గావునఁ బ్రాణ మొయ్యఁ
జంద్రనాడికఁ బూరించి సాధకుండు
భానునాడిక విడుచుఁ బ్రాణానిలంబు.

237


సీ.

నలినాదినానాసనంబులయందును
        గ్రమముమై దేహదార్ఢ్యము వహించుఁ