పుట:కాశీఖండము.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

శ్రీకాశీఖండము


పక్ష్మంబు భ్రూకర్ణలలాటశిరోరుహంబు లను నఱువదియాఱంగంబులు లక్షణాన్వితంబులు గావలయు. అట్టిలక్షణవతియైనభార్య గృహలక్ష్మి. అట్టి గృహిణికతంబునం గదా గృహస్థుం
డిహపరసౌఖ్యంబులకు భాజనం బగు నని చెప్పి కుమారస్వామి కుంభసంభవున కి ట్లనియె.

226


తే.

ఇన్నిపాటులఁ బడఁగ లే దిల్వలాసు
రారి! వర్ణాశ్రమస్థుల కలఘుమతుల
కూర్ధ్వలోకంబు ముక్కున నూర్పుగాలి
యుడిగినప్పుడె కాశియం దొదవు ముక్తి.

227


వ.

అని సదాచారవర్ణనం బొనర్చి కుమారుం డింక నేమి యడిగెద (వ)డుగు మనినఁ గుంభసంభవుండు జ్ఞానకారణంబు లెయ్యవి? యని యడిగినం గుమారుండు.

228


యోగనిరూపణము

తే.

అఖిలవేదాసువచనంబు యజ్ఞపరత
బ్రహచర్యైకనిష్ఠ తపంబు దమము
శ్రద్ధ యుపవాస మపరతంత్రత శమంబు
కలశసంభవ! విజ్ఞానకారణములు.

229


తే.

ధర్మనిర్మలహృదయ! శ్రోతవ్య మాత్మ
తారక బ్రహ్మనిష్ఠ! మంతవ్య మాత్మ
సర్వశాస్త్రప్రవీణ! ద్రష్టవ్య మాత
దంభరహిత! నిదిధ్యాసితవ్య మాత్మ.

230


వ.

ఆత్మావలోకంబునకు యోగాభ్యాసంబు పరమసాధనంబు.

231


సీ.

కుంభినీధరగుహాక్రోడాటవినికుంజ
        గర్భవాసము గాదు కారణంబు