పుట:కాశీఖండము.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

275


సిన నీశానుండు సహస్రధారాకలశంబున సహస్రవారంబులు పంచాక్షరీపంచబ్రహ్మశతరుద్రీయప్రణవాఘోరపాశుపతాదిమంత్రంబు లుచ్చరించుచు విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు దివ్యలింగంబు నభిషేకించి.

139


క.

భువనావరణోదకమున
భవు నభిషేకంబు సేయఁ బాసెను లయతాం
డవకేలీసమయసము
ద్భవ మగునీర్వట్టు కపట పాశుపతునకున్.

140


వ.

అప్పుడు విశ్వేశ్వరదేవుఁడు ప్రసన్నుఁ డై యీశానుండు కోరిన ప్రకారంబున.

141


సీ.

జ్ఞానోద మన శివజ్ఞానంబు నా శివ
        తీర్థంబు నా జ్ఞానతీర్థ మనఁగ
జ్ఞానవాటిక నాఁగ సంజ్ఞాంతరంబులు
        గలిగి పానాభిషేకక్రియలను
సంస్పర్శనామాభిసంకీర్తనధ్యాన
        సందర్శనంబుల సప్తతంతు
ఫలము నీఁజాలు ప్రభావంబు కైవల్య
        సంపత్ప్రదానైకసరసతయును


తే.

సన్నిహత్యాదిఫల్గ్వాదిసకలతీర్థ
సమధికత్వంబు బ్రహ్మరాక్షసపిశాచ
శాకినీగ్రహకూశ్మాండశాంతివిధియు
నిచ్చె నీశానకుండిక కీశ్వరుండు.

142


కళావత్యుపాఖ్యానము

వ.

అని యానతిచ్చి శంభుం డంతర్హితుండయ్యె. ఈశానవాపి