పుట:కాశీఖండము.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

శ్రీకాశీఖండము


గగనగంగాతరంగిణీకనకకమల
పరిమళోద్గారిణికి మహాభైరవుండు.

121


వ.

ఇ ట్లద్దేవుండు విశ్వేశ్వరనివాసంబు సొచ్చినంతన బహిర్భాగంబుననుండి హాహాకారంబున మొఱవెట్టుచు నా బ్రహ్మహత్య పాతాళంబునఁ బడియె. అతనిహస్తంబున నున్న ధాతృకపాలంబును నూడి ధాత్రీతలంబునం బడియె. అది మొదలుగా నవ్వటుకనాథుం డానందంబున నయ్యానందవనంబునం దధివసియించె. కపాలమోచనతీర్థంబు తన్ను భజియించువారికిఁ బాపభంజనంబు సేయుచుఁ బుణ్యప్రదాయకం బయ్యె. ఇయ్యాఖ్యానంబుఁ బఠించినను విన్నను వారలకు మహాపాతకంబు దొలంగు నని చెప్పి కుమారస్వామి వెండియు నగస్త్యున కి ట్లనియె.

122


సీ.

అజుఁడు దా నధికుండ ననుచు గర్వించిన
        గరనఖాగ్రమునఁ దచ్ఛిరముఁ ద్రుంచె
సాకార యగుబ్రహహత్యతోఁ జనుదేర
        సకలలోకంబులు సంచరించె
వైకుంఠమున రమావైకుంఠు లర్పింప
        నమృతభిక్షాశనం బారగించెఁ
గాశికానగరోపకంఠదేశంబునఁ
        బగులవైచెఁ గరంబు బ్రహ్మపునుక


తే.

యాధిపత్యంబు వడసెఁ గామారిచేతఁ
పరియ వైచినచోన కాఁపురము సేసెఁ
గాశికాస్థానమున కేడుగడయుఁ జూవె!
క్రోధభైరవదేవుండు కుంభజన్మ!

123