పుట:కాశీఖండము.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

269


గుచకుంభయుగళిమ్రోఁగునఁ దొట్రుపడి పేద
        కౌఁదీగ జవజవఁ గంప మొందఁ
గ్రుయి వెక్కి జాఱిన క్రొమ్ముడిలోపలి
        విరులు తుమ్మెదలకు విందు పెట్ట


తే.

సహజసంభ్రమతాత్పర్యసమ్మదములుఁ
దళుకు చూపంగ నవరత్నదర్విఁ గొనుచు
నిందిరాదేవి యేతెంచి యిందుధరుని
హస్తపాత్రిక నమృతదివ్యాన్న మిడియె.

119


వ.

ఇట్లు మహాలక్ష్మీదేవిచేత మనోరథవతి యనుపేరం బ్రసిద్ది యగుభిక్షఁ గొని పద్మాక్షునందలి భయభక్తివిశ్వాసంబులకు మెచ్చి యతనికోరినవరంబు లొసంగి యెప్పటియట్ల బ్రహ్మహత్యతోడన యరుగుదేర జగంబులఁ జరియించుచు నొక్కనాఁడు.

120


సీ.

జనని యేతీర్థంబు సకలదుఃఖావళి
        హరణప్రభావవిస్ఫురణమునకు
గృహిణి యేతీర్ణంబు మహితహాలాహల
        గరళచ్ఛవిచ్ఛన్నకంధరునకు
నావాల మేతీర్థ మభిమతప్రదకళా
        కరవిశాలాక్ష్యాఖ్యకల్పలతకు
నావాస మేతీర్థ మఖిలతీర్థాలభ్య
        ముఖ్యసౌఖ్యావహమోక్షమునకు


తే.

నట్టితీర్థంబునకు నెమ్మి నరుగుదెంచెఁ
గాశినగరికి సకలభాగప్రకీర్ణ