పుట:కాశీఖండము.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

267


జూపి యక్కాలాంతకుం డంతర్ధానంబు సేసె. అతండును నీశ్వరోక్తప్రకారంబున సకలజగమ్ములు గ్రుమ్మరుచు నొక్కనాఁడు వైకుంఠపురంబు చొచ్చి వైకుంఠనికేతనంబున కేగిన.

111


సీ.

పదపల్లవంబునఁ బ్రకటిల్లుచదలేఱు
        కడ లెత్తి ధాత్రి వెల్వొడిచి పాఱఁ
గటియందు రంజిల్లు కనకశాటిమెఱుంగు
        గెళవుల రేయెండతళుకు లీనఁ
బొక్కిటి తమ్మిపూవున జాలముసరెడు
        నలులు ఝు మ్మనుచు సంకులతఁ దిరుగఁ
దులసీపలాశమంజులదామకంబులు
        కౌస్తుభపదకంబుఁ గ్రిందుపఱుప


తే.

సంభ్రమము విస్మయంబులు సమ్మతంబు
భక్తియును భాషవీధిలోఁ బరిఢవిల్ల
నిందిరయుఁ దానుఁ బద్మాక్షుఁ డెదురు వచ్చె
భర్గమూర్తికి నయ్యాదిభైరవునకు.

112


వ.

ఇట్లు వచ్చి యాలక్ష్మీశ్వరుం డగ్రభాగంబున.

113


మ.

కనియెం గుండలిరాజకుండలు మహాకాళున్ లలాటస్థలీ
జనితానల్పకృపీటసంభవపటుజ్వాలాకరాళాక్షుఁ బా
వనునిన్ బ్రహ్మకపాలహస్తుని జటావ్యాఢౌకనప్రౌఢది
వ్యనదీవార్లహరీపరస్పరహతివ్యగ్రారవున్ భైరవున్.

114


వ.

కని జయజయశబ్దముఖరుం డగుచుం గదిసి ప్రణమిల్లి యంజలిపుటంబు నిటలతటంబునం గదియించి తత్ప్రభావవర్ణనాకుతూహలంబున నిందిరాదేవి కి ట్లనియె.

115


సీ.

జలజాక్షి! యితఁడు వో సకలయోగీంద్రులు
        భావవీథులఁ గాంచుపరమతత్త్వ