పుట:కాశీఖండము.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

265


గళమూలనిర్గళత్కాలకూటచ్ఛవి
        యర్కబింబంబు మాయంబు సేయ
ఫాలదృగ్భవసముద్భటశిఖిజాలంబు
        లుదధుల నన్నింటి నుడుకఁ బెట్ట
గుటిలపాటలజటాంకురకుట్టనంబులు
        జగదండసీమ బెజ్జములు పుచ్చ


తే.

సంభవము నొందె హరునవష్టంభరభస
శుంభదవగాఢరోషవిస్ఫురణవలన
విశ్వసంహారసన్నాహవిషమసుషమ
పరుషద్భైరవుం డగు భైరవుండు.

105


వ.

ఇ ట్లుద్భవించి యుద్భటప్రతాపదుర్నిరీక్ష్యుం డగుచు నాక్షణంబ విరూపాక్షునాజ్ఞవచనంబునం బద్మగర్భునిం గదిసి.

106


ఆ.

గంధకరటి నూత్నకమలంబుఁ బోలె న
[1]ప్పురుషుఁ డలఘులీలఁ బొటకరింపఁ
ద్రుంచె నవ్విరించి పంచమవదనంబుఁ
బ్రఖరదీర్ఘహస్తనఖరధార.

107


తే.

ద్రోహి యేయంగ మట్టిద రూ పడంపఁ
దగవు గావుప దూషకత్వంబుఁ దెలిసి
తునిమెఁ బరమేష్ఠిపంచమాననమ యేర్చి
భైరవుం డింత యొప్పైనపాడి గలదె?

108


వ.

అట్టియెడ నారాయణాంశజుం డైనక్రతుమూర్తి శైవంబు లైనస్తోత్రంబులు పఠియించె. హిరణ్యగర్భుండును నహంకార ముడిగి భీతిపరవశంబున శతరుద్రీయంబు జపియించె. అంత

  1. పురుషుఁ డలసలీల