పుట:కాశీఖండము.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

255


బరు నెవ్వని దా నెఱుఁగక
చొరనీకుం డనుచు ముక్తిచోరవిశంకన్.

58


వ.

ఈశ్వరాదేశంబునం గాని కాశీనగరం బెవ్వరికిం జొరరాదు. ఈయర్థంబు దేటపడ నొక్కయితిహాసంబు గల దాకర్ణింపుము. దక్షిణాబ్ధితటంబుస సేతుబంధసమీపంబున నొక్కగ్రామంబున ధనంజయుం డనునొక్కవైశ్యోత్తముండు గలండు. అతండు మాతృభక్తుండు. తల్లి జరాభారంబునం బెద్దకాలంబునకుఁ గాలధర్మంబు నొందిన.

59


తే.

గాసివడి గంగ నస్థులు గలపకున్నఁ
దల్లి ఋణ మెట్లు వాయుఁ బుత్రకున కనుచుఁ
గదలె గోమటి యానందకాననమున
కంబదేహాస్థిశకలసంహతులు పూని.

60


సీ.

పంచగవ్యముల నాప్లవనంబు గావించి
        పంచామృతముల నభ్యంగ మార్చి
యక్షకర్దమమున ననులేప మొనరించి
        పుష్పమాల్యంబులఁ బూజ చేసి
పట్టువస్త్రంబునఁ బరివేష్ట మొనరించి
        యా టఁ దిత్తిలో నదిమి తుఱిమి
పుటవిగాఁ గంబళంబున ధ్రువంబుగఁ గట్టి
        ముద్దగా మన్నద్ది ముద్ర వెట్టి


తే.

జతనముగ రాగిపెట్టెలో సంగ్రహించి
యరవఁ దాలంబు నీని చి క్కలవరించి
యంబయస్థుల కుపచార మాచరించె
నొడయనికిఁ బోలె గురుభక్తుఁ డూరుభవుఁడు.

61