పుట:కాశీఖండము.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

246

శ్రీకాశీఖండము


తే.

చక్రమునఁ ద్రవ్వి యొక్కపుష్కరిణి చేసి
ఖననవేళాప్రయాససంజనిత మైన
ఘర్మజలమునఁ బూరించె గైటభారి
యమ్మహాపల్వలంబుఁ గాశ్యంతరమున.

19


క.

వేయును నెనిమిదియేడులు
తోయజలోచనుఁడు చేసె దుస్సహతప మ
త్తోయాధారముదరిఁ గా
త్యాయన్యధిపతి గుఱించి యతులితభక్తిన్.

20


వ.

అనంతరంబ.

21


శా.

ఇందూత్తంసుఁడు కాశికాధిపతి విశ్వేశుండు ప్రత్యక్షమై
కందర్పారి ముకుందనిర్మితమహాకాసారముం జూచి యా
నందం బొందె వృషధ్వజుండు బహుమానశ్లాఘఁ గావించెఁ దా
మందాందోళితమౌళియై వడి శిరోమాల్యానలుల్ మ్రోయఁగాన్.

22


క.

ఫణిభూషణుండు వాపీ
ప్రణుతిశ్లాఘాపరంపరల నొనరింపన్
ద్రిణయనునిదక్షిణశ్రుతి
మణికర్ణిక మిట్టి సరసిమధ్యమునఁ బడెన్.

23


వ.

పరమేశ్వరశ్రవణమణికర్ణికాప్రపతనస్థలం బగుటం జేసి యచ్చక్రపుష్కరిణి మణికర్ణికాహ్వయం బై యుండు.

24


తే.

చక్రపుష్కరిణీతీర్థసవిధభూమి
శంఖచక్రగదాపాణి శంభు నడిగెఁ
గాశికాతీర్థమాహాత్మ్యగౌరవంబు
శివుఁడు నాకతి యిచ్చె నక్షీణకరుణ.

25