పుట:కాశీఖండము.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

శ్రీకాశీఖండము


పలికినఁ గుంభసంభవుండు కుమారస్వామి పాదాంభోరుహంబుల కెరఁగి యిట్లనియె. మహాత్మా! యవిముక్తంబు మోక్షస్థానం బనియును, మణికర్ణికాతీర్థంబు తీర్థరాజం బనియును, అప్పుణ్యక్షేత్రం బవిముక్తం బానందకాననంబు మహాశ్మశానంబు రుద్రావాసంబు వారణాసి కాశి యను నామధేయంబులు ధరియించు ననియునుం జెప్పుదురు. అన్నియుం బరిపాటి వినవలతుం దేటపడ నానతిమ్ము.

4


తే.

అనినఁ బర్వతరాజకన్యాసుతుండు
కలశసూతికి ని ట్లను గారవమున
నిల్వలారి! భవత్సముదీరిత మగు
ప్రశ్నభావంబు విస్తరింపంగ భరము.

5


వ.

ఈయర్థంబు మాతల్లి పార్వతీదేవి మజ్జనకు హరు నడిగె. ఆసర్వజ్ఞుండు నాజగన్మాతకు నానతిచ్చినప్రకారంబు నీకుం జెప్పెద; సావధానమతివై యాకర్ణింపుము.

6


వారాణస్యాదినామనిర్వచనము

సీ.

అంబుజాసను నాయురవసానములయందు
        గ్రస్తసమస్తలోకప్రపంచ
యై మాయ నిర్వికల్పాకారమునఁ దను
        నాశ్రయింపఁగఁ బరమాత్మ యుండె
నిస్తరంగసముద్రనిభమై నిరస్తస
        మస్తావధికమయి ప్రాణి కర్మ
పరిపాకకాలంబు ప్రాప్త మయ్యెడునంత
        దాఁక నవ్వేళ విధాతృసృష్టి