242
శ్రీకాశీఖండము
| పలికినఁ గుంభసంభవుండు కుమారస్వామి పాదాంభోరుహంబుల కెరఁగి యిట్లనియె. మహాత్మా! యవిముక్తంబు మోక్షస్థానం బనియును, మణికర్ణికాతీర్థంబు తీర్థరాజం బనియును, అప్పుణ్యక్షేత్రం బవిముక్తం బానందకాననంబు మహాశ్మశానంబు రుద్రావాసంబు వారణాసి కాశి యను నామధేయంబులు ధరియించు ననియునుం జెప్పుదురు. అన్నియుం బరిపాటి వినవలతుం దేటపడ నానతిమ్ము. | 4 |
తే. | అనినఁ బర్వతరాజకన్యాసుతుండు | 5 |
వ. | ఈయర్థంబు మాతల్లి పార్వతీదేవి మజ్జనకు హరు నడిగె. ఆసర్వజ్ఞుండు నాజగన్మాతకు నానతిచ్చినప్రకారంబు నీకుం జెప్పెద; సావధానమతివై యాకర్ణింపుము. | 6 |
వారాణస్యాదినామనిర్వచనము
సీ. | అంబుజాసను నాయురవసానములయందు | |