పుట:కాశీఖండము.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

239


గాశీప్రాపణద్వారంబున నానాసదుపకారంబులై మోక్షంబు సిద్ధించు, కాశి యవ్యవధానంబున ముక్తినిచ్చు ననునర్థంబుఁ దేటపఱచె. ఇది శివశర్మనిర్వాణం బను నుపాఖ్యానంబు. దీని విన్ననుం బఠియించినను వ్రాసినను నరుల కాయురారోగ్యైశ్వర్యములు సంభవించు నని చెప్పి.

302


ఉ.

చేసెఁ బ్రదక్షిణంబు కలశీసుతుఁ డద్రికి మల్లికార్జునా
వాసశిఖాంతరంబునకు వామవిలోచనతోడఁ గూడ విశ్వా
సము భక్తియున్ హితము శాంతియు దాంతియు నొప్ప నంతరా
ధ్యాసితశంభులింగసముదాయము వారక సంభజించుచున్.

303


వ.

చేసి కతిపయప్రయాణంబుల.

304


అగస్త్యుండు కుమారస్వామిని దర్శించుట

లయగ్రాహి.

సామిమలకుం జని మహాముని ఘటోద్భవుఁడు
        భాషయును దాను గడునేమమునఁ బుణ్యా
రామతరువాటి మణిధామమున నున్న యభి
        రామసుకుమారతరహేమనిభగాత్రున్
సామజముఖానుజు సుధామధురమందహసి
        తామలకపోలవదనామృతమయూఖున్
హైమవతిపట్టి నఖిలామరశరణ్యు నత
        కామితకరున్ గొమరసామి భజియించెన్.

305


వ.

అనిన విని నైమిశారణ్యవాసులు కుమారస్వామి దర్శించిన యటమీఁది వృత్తాంతం బెయ్యది? యని యడిగిన.

306


ఆశ్వాసాంతము

శా.

వేమక్షోణివరానుసంభవ! దిశావేదండగండస్థలీ
సీమావిచ్ఛిలదానగంధలహరీశ్లేషానుభూతిక్రియా