పుట:కాశీఖండము.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

235


శివశర్మయు నమ్మాటకు సంశయాకులుండగుచుఁ దదూర్ధ్వంబుగాఁ జని చని పుణ్యశీలసుశీలురం జూచి మన కింక నెంత ద వ్వరుగవలయు నెఱింగింపుఁడు. ఇప్పుడు పితామహుండు కాశియందు శరీరంబు విడువనివారికి మోక్షంబు లేదనియె. నాకు నిశ్రేయసంప్రాప్తి యెట్లు గల్గు? అవ్విధంబును వివరింపుఁ డనిన వార లిట్లనిరి.

291


తే.

ఉర్వి కెనిమిదికోటుల యోజనముల
పొడవునం దుండు నా బ్రహ్మభువన మనఘ!
యీప్రమాణంబునం దుండు నిందుమీఁద
విష్ణులోకంబు సతతవర్థిష్ణు వగుచు.

292


వ.

అవ్వైకుంఠంబునకు మీఁదఁ బదాఱుకోట్లయోజనంబుల పొడవున శివలోకంబు కైలాసాహ్వయం బనం దనర్చు. దానికిం బరమం బగు లోకంబు లేదు.

293


తే.

సంశితాచారపర! దాని సంస్తుతింప
నాక కా దచ్యుతునకైన నలీనభవున
కెన శంభునకైనను నహివిభునకు
నైన గీష్పతికైనను నలవి గాదు.

294


వ.

అప్పరమస్థానంబునందు నిందుధరుండు గిరినందనాసహాయుండై దణాధిస్కందనందికేశ్వరాదులు గొలువ నుదారవిహారంబులం బ్రవర్తిల్లుచుండు. అవ్విశ్వేశ్వరుండు విశ్వరక్షణార్థంబుగాఁ జతుర్భుజుఁ జతుర్దశభువనాధిపత్యంబునకుం బట్టాభిషిక్తుం జేసి యనంతరంబ.

295