పుట:కాశీఖండము.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

209

శ్రీకాశీఖండము


లుగా హరి సదస్యుండుగా సినీకుహూద్యుతిపుష్టిప్రభావసుకీర్తిధృతిలక్షులనం దొమ్మండ్రుధర్మపత్నులతోడం గూడి యుమామహేశ్వరప్రీత్యర్థం రాజసూయాధ్వరంబు నొనర్పి యవార్యం బైనయౌదార్యంబున.

178


ఉ.

దక్షిణ యిచ్చె ముజ్జగము దానగుణప్రవరుండు లీల ఫా
లాక్షునిసన్నిధిన్ మఘసమాపనకాలమునందుఁ దారకా
ధ్యక్షుఁడు కాశికాపురమునందు సదస్యులకు బ్రసాదసం
రక్షితసర్వవిష్టపుఁడు రాజు ప్రతాపవిరాజమానుఁడై.

179


తే.

ఇంద్రుకుండంబుకెలనఁ జంద్రేశునొద్దఁ
గాశిలో నవిముక్తోపకంఠభూమిఁ
దపము చేసినచోటన ధవళకిరణుఁ
డాహరించెను రాజసూయాధ్వరంబు.

180


వ.

ఇట్లు రాజసూయాధ్వరంబు చేసినసుధాకరు నవభృథస్నానానంతరమున.

181


సీ.

సకలలోకాహ్లాదసంధానహేతువై
        వెలయ నీకౌముదీవిభ్రమంబు
వర్తింతు వీవు నామూర్తిభేదంబులం
        దొకమూర్తివై సమగ్రోదయమున
శ్రీకాశిలోఁ బ్రతిష్ఠించినాఁడవు నన్ను
        జంద్రేశ్వరుం డనుసంజ్ఞఁ గూర్చి
బ్రహ్మదత్తం బైనరథ మెక్కి యవలీలఁ
        దిరిగి తష్టాదశద్వీపములను


తే.

నాహరించితి రాజసూయాధ్వరంబుఁ
దత్పరత మీఱఁ ద్రైలోక్యదక్షిణముగఁ