పుట:కాశీఖండము.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

203


భనవంతుండగుఁ గీర్తిమంతుఁడగు సత్ప్రాధాన్యవంతుం డగున్
ధనదాధీశ్వరు మానవోత్తముఁడు సందర్శించి కాశీస్థలిన్.

160


వ.

విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు దక్షిణభాగంబునం గుబేరేశ్వరస్థానంబునందుఁ గుబేరేశ్వరు సేవించినవారికి నణిమాద్యష్టైశ్వర్యంబులు సిద్ధించు నని యిట్లు యాజ్ఞదత్తికి నభిమతంబులం బ్రసాదించి దేవుండు దేవీసహితుండై యనక్షరం బైనపదంబు ప్రవేశించె. ఈ ప్రకారంబున శంభుతోఁ జెలికారంబు వడసి ధనదుఁడు.

161


సీ.

ఏపట్టణమునకు నెలదోఁట నందనా
        రామంబు తాఁ జైత్రరథవనంబు
క్రీడావిహారదీర్ఘిక యేపురమునకు
        మధురామృతాంబువు మానసంబు
మాణిక్యముకురబింబంబు కైలాస మే
        నగరివారవధూజనప్రతతికి
నేవీటిపొలిమేర యింత యం తనరాని
        దవ్వుల నున్న యుత్తరఫుదిక్కు


తే.

యట్టియలకాపురము నిధానాధివరము
రాజధానిగఁ దారకారాజమౌళి
రాజితం భైనకృపపెంపు ప్రాపు గాఁగ
రాజరా జేలె నెరవైన రాజసమున.

162


వ.

ఆరాజరాజు రాజీవభవహరిపురందరాది బృందారకమకుటసందానితవికచమందార కుసుమమాలా మకరందబిందుధారాధౌతచరణారవిందు మందరాచల మంథాన మధ్యమాన దుగ్ధజలనిధిగర్భావిర్భూతకాలకూటకృపీటభవపిండగండూ