పుట:కాశీఖండము.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

శ్రీకాశీఖండము


విమలసలిలప్రవాహంబు లయ్యె. సకలభూతంబులమనంబులు తెలివొందె. విద్యాధరయక్షగంధర్వులు వసిష్ఠవాలఖిల్యాదిమునులు బ్రహ్మవిష్ణుమహేశ్వరులుఁ గుమారావలోకనకౌతూహలాయత్తచిత్తు లయి యేఁగుదెంచి. రాసమయంబున.

10


క.

ద్రుహిణుండు కైటభారియు
నహికటకుఁడు గూడి యిచ్చి రక్కొడుకునకున్
గృహపతి యనియెడునామము
మహనీయకృపావిధేయమానసు లగుచున్.

11


వ.

పదునొకండవదినంబున నామకరణంబు గల్పించి వేల్పులు చన్నపిమ్మట గురుజనంబులు క్రమంబున.

12


సీ.

గృహనిష్క్రమంబు సాగించిరి నాల్గవ
        మాసంబునందుఁ గుమారునకును
వత్సరార్ధమునందు వాలాయముగఁ జేసి
        రన్నసంప్రాశనం బర్భకునకు
నంతఁ జూడాకర్మ మాచరించిరి బిడ్డ
        నికి గృహ్యసంప్రోక్తనియమపరతఁ
దఱితోడఁ గర్ణవేధంబు గల్పించి
        శ్రవణర్క్షమున నాత్మసంభవునకు


గీ.

బ్రహ్మతేజోభివృద్ధికై పంచమాబ్ద
వేళ సల్పి రుపాకర్మవిధి సుతునకుఁ
జదువఁ బెట్టిరి వేదంబు పదముఁ గ్రమము
సాంగముగ బాలకుని నుపాధ్యాయునొద్ద.

13


వ.

అంత నొక్కనాఁడు నారదుండు యదృచ్ఛాగతుండై యతిథి