పుట:కాశీఖండము.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

155

వీరేశ్వరప్రభావవర్ణనము

వ.

అమ్మహజ్యోతిర్లింగమూర్తి విశ్వేశ్వరుఁడనం బ్రసిద్ధివహించె. అమ్మహేశ్వరుండు జయద్రథునకు, విదూరసునకు, మగధాధిపతికి, వసుదత్తునకు, మనోరథార్థంబుల చిరకాలంబునంద బ్రసాదించె. నేనును విశ్వేశ్వరమహాదేవు నారాధించి యభిమతార్థంబు(లు) వడసెదం గాక యని చంద్రకూపజలంబున నభిషేకం బొనరించి సంకల్పపూర్వకంబుగా నియమంబు వహించి యొక్కమాసం బేకాహారుండును, నొక్కమాసంబు నక్తాశనుండును, నొక్కమాసం బయాచితాశనుండును, నొక్కమాసంబు నిరశనుండును, నొక్కమాసంబు పయోవ్రతుండును, నొక్కమాసంబు శాకఫలాశనుండును, నొక్కమాసం బష్టతిలాహారుండును, నొక్కమాసంబు పానీయుండును, నొక్కమాసంబు పంచగవ్యాశనుండును, నొక్కమాసంబు చాంద్రాయణవ్రతుండును, నొక్కమాసంబు కుశాగ్రజలపాయియు, నొక్కమాసంబు వాయుభక్షుండును నై సంవత్సరంబు గడపి త్రయోదశమాసంబునం బ్రథమదినసంబున.

234


సీ.

హరు లేడు నేడుకక్ష్యాంతరంబులు గాఁగ
        నియమంబునా నాజ్ఞ నిలుపువాఁడు
వెండికట్టులతోడివేత్రంబు మాఱుగా
        బంగారుముని(లు)కోల పట్టువాఁడు
ఝంకించి వెరపుతర్జనకోటిచందానఁ
        గఱకుచీఁకటివెన్ను సఱచువాఁడు
వసుమతీభృచ్ఛ్రేణి వరుసతో గుఱి చూపి