పుట:కాశీఖండము.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

శ్రీకాశీఖండము


సంతానము సురధేనువు
చింతామణి సిద్ధరసము! చిరతరపుణ్యా!

218


వ.

సంతానంబు గలుగునట్టియుపాయంబు చింతింపుమని ప్రార్థించిన.

219


ఉ.

ఇంతవిచార మేమిటికి నిందునిభానన! నెమ్మనంబులో
సంతతిలబ్ధికై విడువు శంక శశాంకకళాకిరీటుఁ గా
లాంతకుఁ గాశికానగరహాటకనిర్మలహర్మ్యమాలికా
భ్యంతరవర్తి విశ్వపతి నాశ్రితవత్సలు నాశ్రయించెదన్.

220


వ.

అనిన విని శుచిష్మతీదేవి యర్చిష్మత్ప్రభావుం డగుభర్తకు వెండియుం బ్రణమిల్లి పాణిపల్లవంబులు మొగిడ్చి వినయవినమితోత్తమాంగయై యార్య(పుత్రా!) పుత్రసంతానలాభంబు నాయందుం బడయ నభిమతంబ యేని నేనుం బ్రసాదభాజనంబ నగుదు నేని నిందుశేఖరసదృశుం డైననందనుం బ్రసాదింపు మనుటయు.

221


తే.

ధర్మగేహినిపైఁ గలకూర్మిపేర్మి
శంసితవ్రతుఁ డైనవిశ్వానరుండు
వనరుహాయతనేత్ర కోరినవరంబు
మునికులశ్రేష్టుఁ డిచ్చితి ననుచుఁ బలికె.

222


సీ.

ఇంతి మనోరధం బెట్లు నీయఁగ వచ్చు?
        నేయింతి పతి వేఁడె నిట్టివరము?
వరము వేడిన వేఁడవచ్చుఁ గా కిబ్భంగి
        నీ నేరవచ్చునే యీప్సితార్థ?
మాగమంబులు సమానాధికరహితుఁ గా
        శీతాంశుశేఖరుఁ జెప్పుచుండు