పుట:కాశీఖండము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

149


తే.

విసువు లే కగ్నిహోత్రంబు వేల్వఁ బెట్టు
దీపధూపంబు లొడఁగూర్చు దేవపూజ
కోగిరంబులు గావించు నొప్పుగాఁగ
బాల ప్రాణేశుహృదయంబు పల్లవింప.

213


వ.

అనంతరంబ యౌవనారంభమున నారంభోరువు వినయవతియు, వివేకవతియు, విలాసవతియు, విభ్రమవతియు, శాంతిమతియు, సౌజన్యవతియు, సౌహార్దవతియు నై శుశ్రూషాతాత్పర్యంబునం బతిడెందంబున కానందంబు సంపాదించుచుండం బెద్దకాలం బరిగిన.

214


తే.

కానరాదయ్యెఁ బుత్త్రసంతానలబ్ధి
యెన్నినోములు నోఁచిన నిందుముఖికి
నంత నొకనాఁడు తరుణి యేకాంతవేళ
విభునిపాదంబులకు మ్రొక్కి విన్నవించె.

215


ఉ.

కట్టితి బట్టుఁబుట్టములు కాంచనభూషణముల్ ధరించితిం
బెట్టితి బంధుకోటికి నభీప్సితవస్తుచయంబు గీర్తి చే
పట్టితి మీపదాబ్జములు పాయక నిచ్చలు సేవసేయఁ గాఁ
బట్టి వసుంధరం గలరె భామలు నాసరి భాగ్యసంపదన్?

216


క.

సకలైశ్వర్యసమృద్ధులు
నొకతల సంతానలాభ మొకతల యిది యే
టికిఁ దడసె? నిందురేఖా
మకుటునికృప యేల లేదు మన కిప్పాటన్?

217


క.

చింతించి చూడవచ్చిన
సంతానము వంశమునకు సకలంబునకున్