పుట:కాశీఖండము.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

145


సుంధరాధిపతులు, జ్యోతిప్టోమాదియాగంబులు చేసినసోమయాజులుం, దులాపూరుషాదిమహాదానంబులొనర్చినదాతలు, సంగ్రామంబుల నపరాఙ్ముఖులై యక్లీబవాదులై యీల్గినవీరులు వసియింతు రని యనంతరంబ యగ్నిలోకంబున నర్చిష్మతీపురంబు చేరం గొనిపోయి శివశర్మకుఁ బుణ్యశీలసుశీలు రి ట్లనిరి.

204


సీ.

అమరావతీపురం బమరవల్లభుఁ డేలు
        నర్చిష్మతీపురం బగ్ని యేలు
శ్రాద్ధదేవుం డేలు సంయమనీపురం
        బసురనాయకుఁడు పుణ్యవతి నేలు
నమలవతీపురం బంబునాయకుఁ డేలు
        వాయు వేలును గంధవతిపురంబు
నలకాపురంబు యక్షాధీశ్వరుం డేలు
        నైశాని యేలు జన్ద్రార్ధమౌళి


తే.

యనిరి దిక్పాలపురములం దవనిసురుఁడు
రెండవపురంబు నీక్షించి ప్రీతి నుండె
నపుడు వర్ణింపఁ దొడగి రయ్యగ్నిలోక
మహిమసంపద గోవిందమాన్యహితులు.

205


సీ.

శిఖ కర్మఠులకు నిశ్రేయసశ్రీదాత
        ధరణీసురులకుఁ దీర్థంబు వహ్ని
యాశుశుక్షణి గురుం డవనినిర్జరులకు
        నగ్రవర్ణుల కగ్ని యాశ్రమంబు
దహనుఁ డేడ్గడయు నుత్తమవర్ణభవులకుఁ
        బావకుం డీశుండు బ్రాహ్మణులకుఁ
బ్రత్యయంబు తనూనపాత్తు బాడబులకుఁ