పుట:కాశీఖండము.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

115


తే.

పరమకల్యాణి యాపగాంభస్త్రివేణి
రాజరేఖావతంసుగారాపురాణి
సమధికప్రీతిఁ దేలి యాసత్యవాణి
కేవలత్వశుభశ్రేణి గ్రుంకువెట్టె.

90


తే.

అఖిలతీర్థంబులును నాడి యవనిసురుఁడుఁ
గోర్కిమెఁ బుణ్యలక్ష్ములఁ గొల్లవెట్టె
నటువిశేషించి గంగాప్రయాగతీర్థ
మధికతాత్పర్యనిష్ఠతో నాడఁదొడఁగె.

91


సీ.

వైకుంఠముననుండి వచ్చి వైకుంఠుండు
        దేవీసహాయమై తీర్థ మాడు
గోలోకముననుండి గోమాతృకలు వచ్చి
        తీర్థ మాడుదు రతిస్థిరమనీషఁ
గాశికాపురినుండి కాలకంఠుఁడు వచ్చి
        దివసంబు దివసంబు తీర్థ మాడు
వరుస దిక్కులనుండి వచ్చి దిక్పాలురు
        త్రిదశేశ్వరాదు లాడుడురు తీర్థ


తే.

మమరగంధర్వసిద్ధవిద్యాధరర్షి
గరుడకిన్నరయక్షరాక్షసపిశాచ
భూతములు దీర్థ మాడు వేఁబోక చివరఁ
బూష మకరస్థుఁడైన యప్పుడు ప్రయాగ.

92


వ.

అది ప్రజాపతిక్షేత్రంబు యాగంబులకంటెను బ్రకృష్టం బగుటం జేసి దానికిఁ బ్రయాగసమాహ్వయం బన్వర్థనామంబై యుండు. మార్తాండుండు మకరరాశిస్థుండై యుండ మాఖమాసంబున మఘవమణిశిలాశకలవిసరవిసృమరకిరణసందోహ