పుట:కాశీఖండము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

111


కాంత! శ్రీశైలంబుకంటె వేగంబునఁ
        గేదార మీఁ జాలుఁ గేవలత్వ
మంతకంటెను వేగ మరవిందలోచన!
        యమృత మీనొప్పుఁ బ్రయాగతీర్థ
మాప్రయాగముకంటె నతివేగమునఁ జేయు
        నవవర్గ మింతి! మహాశ్మశాన


తే.

మతివ! యానందకాననప్రాప్తికరము
లఖలతీర్థంబులును సందియంబు లేదు
కాశికాతీర్థ మాడక కదియరాదు
లక్షతీర్థంబు లాడిన మోక్షలక్ష్మి.

78

శివశర్మోపాఖ్యానము

వ.

ఈయర్థంబు దేటపడ నొక్కయితిహాసంబు చెప్పెద వినుము. మధుర యనుపట్టణంబున శివశర్మ యను విప్రోత్తముండు గలఁడు. అతఁడు వేదంబులు చదివి, తదర్థంబు లెఱింగి, ధర్మశాస్త్రంబులు పఠించి, పురాణంబు లధిగమించి, యంగంబు లభ్యసించి, తర్కంబు లాలోడించి, మీమాంసాద్వయం బాలోచించి, ధనుర్వేదం బవగాహించి, యాయుర్వేదంబు విచారించి, నాట్యవేదంబు గ్రహించి, యర్థశాస్త్రంబు(లు) ప్రాపించి, మంత్రశాస్త్రంబు(లు) దెలిసి, భాషలు గఱచి, లిపులు నేర్చి, యర్థం బు(లు)పార్జించి, ధర్మంబులు చేపట్టి, భోగ్యంబు లనుభవించి, పుత్త్రుల నుత్పాదించి, వారి కర్థంబు విభజించి యిచ్చి, యౌవనంబుపోకకు ముదిమిరాకకు శోకించి వ్యాకులుం డయి నిజాంతర్గతంబున.

79