పుట:కాశీఖండము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

101


యభివ్యక్తంబై పరావా క్కనంబడు.ఆబ్రహ్మం బీనాభిపర్యంతం బావాయువుచేత నభివ్యజ్యమాసంబై విమర్శరూపంబైన మనంబుతోడంగూడి సామాన్యస్యందప్రకాశరూపిణియుఁ గార్యబిందుతత్త్వాత్మికయు నీశ్వరాధిదేవతయు నై పశ్యంతీవా క్కనంబడు. ఆ బ్రహ్మం బావాయువు చేతన హృదయపర్యంతం బభివ్యజ్యమానంబై నిశ్చయాత్మకబుద్ధియుక్తంబై
విశేషస్పందస్వరూపయు నాదబిందుమయయు హిరణ్యగర్భాధిదేవతయు నై మధ్యమవా క్కనంబడు. ఆ బ్రహ్మం బాస్యపర్యంతం బావాయువుచేతన కంఠాదిస్థానంబులయం దభివ్యజ్యమానంబై యకారాదిక్షకారాంతవర్ణమాలారూపంబై (నిశ్చయాత్మయై) శ్రోత్రగ్రహణయోగ్యంబై వైఖరీవా క్కనంబడు. ఈచతుర్విధసూక్ష్మస్థూలమాతృకాస్వరూప విట్టి (దేవీ!) నీకు నమస్కారంబు.

49


తే.

అని నుతించినఁ బ్రియ మంది యబ్ధికన్య
కలశజునిఁ జూచి యి ట్లను గారవమున
ననఘ! నీస్తోత్రమునకు నాయాత్మ మెచ్చె
నీవు గోరినవర మిత్తు నెమ్మిఁ గొనుము.

50


వ.

ఇంకఁ రాఁగలయిరువైతొమ్మిదవద్వాపరంబున నీవు వ్యాసుండవై వారణాశీపురంబున వేదపురాణసంహితాధర్మశాస్త్రంబులు వక్కాణింపంగలవాఁడవు. ఇప్పు డొక్కహితంబు సెప్పెదఁ. దుంగభద్రాతీరంబునం గిష్కింధాచలోపాంతంబున స్వామిమల యనుకాననంబునం గుమారస్వామి యధివసించియున్నవాఁడు. నీ వాచక్కటి కరిగి యతనివలన వారణాశీస్థానమాహాత్మ్యంబు వినుమని పలికి లోపాముద్రం గనుం