పుట:కామకళానిధి.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నడుగుముట్టనుంచ నది ఫణిభోగంబు
నాఁగవెలయు దర్పకాగమమున.


వ.

ఈహస్తంబు హస్తినీజాతివారి కమరియుండు మఱియును.


క.

తర్జనీమాత్ర మంగజాగారసీమ
ఘుటికపై నుంచ ద్రవియించుఁ గొమరుమిగుల
నదియ కామాంకుశంబని యఖిలకామ
శాస్త్రవేత్తలు తెల్పిరి సమ్మతముగ.


క.

అంగుష్ఠము తర్జునియును
సంగతిగా నర్ధచంద్ర సరవి నిల్పుచో
నంగుళు లర్ధేందుదగన్
రంగుగ నంగనలనెల్లఁ ద్రవియింపఁదగున్.


వ.

ఈయర్ధేందుహస్తంబుఁ బడబాజాతినాతులకుఁ దగి
యుండు. దీనిమార్గంబు నంగుష్ఠంబు చంద్రనాడియం దుంచి
తర్జని కామాందోళికలందు నిల్పి చలింపఁజేయ సురతజలంబు
బహుళంబుగాఁ గల్గి కళోదయంబగు మరియును.


క.

రాధానందన వితరణ
రాధానందనపరాక్ర మస్మరణనిభా