నతఁడు చెలువొందు నిఖిలరాజాధిరాజ రాజకోటీరత్న నీరాజితాంఘ్రి రణతలకిరీటి విముఖితారాతికోటి సాంబశివమూర్తి యేకరాట్చక్రవర్తి.
పారసీకారట్టబాహ్లికాజానేయ ఘోట్టాణదట్టముల్ గొలిచి నడువ దండెత్తి నర్మదా దక్షిణావని సీమఁ గల భూపతులనెల్లఁ గలచి వైచి చేరి కర్ణాటకక్షితి బెంగుళూరిలో నిలచి వింధ్యాచలతలమునందు నతులపంచద్రావిడాధీశజయకృతా క్షరపంక్తితో స్తంభ మునిచి మరియు మైసూరిబలముచే మగ్నుఁడైన పాండ్యరాజును రక్షించి ప్రబలుఁ డగుచు చోళరాజ్యంబుఁ గైకొని యేలుచుండె రమ్యగుణశాలి యేకభూపాలమౌళి.
మానితగుణ సైబాయియు ధీనిధియగు నానుబాయి దీపాంబలనన్ శ్రీ నీళాభూరమణుల బోలువధూమణుల నితఁడు మువుర వరించెన్.