పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

53

ప్రధమాశ్వాసము



      పౌత్త్రప్రపౌత్త్రాదిబహుసంతతిని దన
                ర్చుచుఁ జిర కాలంబు ప్రచురసంప
      దభివృద్ధిశోభితశుభసౌఖ్యములు గాంతు
                రనుమాట యున్నది యాదియంద

గీ. యేను నీ కది చెప్పిన వానికొఱకు
     నవనిఁ బుట్టంగవలయునో యని వెఱచెదఁ
     బ్రాణవల్లభ యవి తావకాంగసంగ
     సౌఖ్యమునఁ బేర్చునాకు నిష్టంబు లగునె. 204

గీ. ఆది నీకథ వింటి వెట్లనియెదేని
     యేను వినినట్టిపిమ్మట నిట్టిమాట
     పలికె నొక యమోఘవాగ్విలసనుండు.
     కావున వచింప విన నిఁకఁ గాదు నీకు. 205

వ. అని చెప్పెనని చెప్పి నారదుండు. 206

గీ. అతివ విను రంభకును గలయట్టిభయము
    నాకుఁ గల్గుటఁ దత్కధ నీకుఁ జెప్పఁ
    గూడ ద ట్లయ్యు మిక్కిలిఁ గువలయమున
    వెలయఁ గల దది వెలయుత్రోవలును గలుగు. 207

వ. అది యట్లుండె రంభానలకూబరు లవ్విధంబున సల్లాపం బొనరించినయనంతరంబ తద్విమానంబు
    మత్సమీపంబున కేతేర మీడోలికాప్రసంగంబులు వడియెనని కలభాషిణికిం