పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39

ప్రధమాశ్వాసము

    
    యేమో కాని యిఁక న్నర
    భామలపోఁడుముల కితఁడు భ్రమయక యున్నే


వ. అని తనమనంబునం గలయీరసంబు సైరింపంజాలక యెక్కసక్కెంబుగా నాడుమాటలకు
    సందియంబు నొందుచు నిది యేమి యనుట వివరింపు మని మునివరుండు నిలిచి
    యడుగుటయు దేవరకుం బ్రస్తుతగమననిరోధంబు గాకుండ విమానంబుమీఁదికి విచ్చేయుఁడు
    మీవంటిమహానుభావులం గొంతమేరయైనం గొలిచివచ్చుట భాగ్యంబుగాదె యనుచుశిష్య
    సమేతంబుగా నతనిం దమవిమానమునందు నునుచుకొని తదలంకారచామరంబులు రెండును విడిచి
    పుచ్చుకొని తన ప్రియుండునుం దాను నిరుగెలంకుల నిలిచి యల్లనల్లన వీచుచు నప్పడంతి
    మౌనివర్యా యిప్పుడు మీరలాడోలికా విహారిణుల ప్రసంగంబున శిష్యుతోడ నే మనిపలికితి రది
    యానతీయవలయు ననుటయుఁ జిఱునగవుతో నతండు.


మ. బళిరా సత్కవి వౌదు నిక్కమ తగ న్బావించి నీ వన్న యా
    యెలప్రాయంపుమిటారికత్తెలబెడం గే నెందునుం గాన వా
    రలడోలాచలనోచ్చలచ్చరణముల్ త్రైవిష్టపస్త్రీలయౌ
    దలఁ దన్నంజనునట్లు మించెననినం దప్పేమి యొప్పేయగున్.

క. అని పలికితి నిం దే మై
   నను గాని తెఱంగు గలిగినం జెపుమా యో