గోదోహకుఁడు.
1095
లవణాశనుఁడు.
లవణాశనుని వినుము. పూర్వము గ్రామవాసి యైన గహ్వరు నొకని నగరవాసి యయిన మిత్త్రుఁడు ఒకప్పుడు తన యింటికిఁ గొనిపోయి ఉప్పుచేత రుచ్యము లయిన వ్యంజనములతోను ఇంక నితరభోజ్యములతోను భోజనము పెట్టించెను. ఈ భోజ్యవ్యంజనాదులకు ఇంతరుచి దేనివలనఁ గలిగిన దని గహ్వరుఁడు మిత్త్రుని అడిగెను. ఉప్పుచేత కలిగిన దని మిత్త్రుఁడు చెప్పెను. 'అట్లయిన దానినే భక్షింపవలసినది' అని నూఱిన యుప్పు పిడికెఁడు ఎత్తి వాఁడు నోటఁ బోసికొనెను. ఆ పొడి ఆ మూఢుని పెదవులకు మీసాలకును అంటుకొని ధవళిమం గలిగించెను; దానిం గని పరిహసించిన జనుల మొగములును ధవళము లాయెను.
గోదోహకుఁడు.
గోదోహకుని వినుము. మూడుఁ డైన యొకగ్రామ్యునికి ఒక గో వుండెను. అది వానికి దినమునకు నూఱు పలముల పాలు ఇచ్చుచుండెను. ఇట్లుండఁగా వానికి ఒకప్పుడు పండు గొకటి సంప్రాప్తమైనది. అంతట పండుగునాఁడు పా లన్నియు ఒక మాఱుగానే గ్రహింతునుగాక యని ఆలోచించుకొని ఆ మూర్ఖుఁడు నెలదినములు ఆవును పిదుకక యుండి పండుగునాఁడు పిదుకఁగా ఒక బొట్టయినను పాలు రావు. లోకులు అమితముగా పరిహసించిరి.