Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళావతి సూర్యప్రభునికడకు వచ్చుట.

749

సుతుఁడు జయశీలుఁడు దైత్యేంద్రుఁ డున్నాఁడు. ఈమె కలావతి యని యతనికి ప్రాణాధిక యయిన కూఁతురు. ఆయన ఇప్పుడు బలియొద్దనుండి వచ్చి యిట్లనియె. 'ఆహా! ఈ దినము సునీథుఁడు బ్రదికి వచ్చినాఁడు; సుముండీకావతారము సూర్యప్రభుఁ డనుచిన్న వాఁడును అగపడినాఁడు. అతనిని విద్యాధర చక్రవర్తినిగా శంకరుఁడు ఏర్పరించి యున్నాఁడు. కనుక ఇప్పుడు సునీథునికి ఆనందసమ్మానము చేసెదను. నాకుమారిని కళావతిని సూర్యప్రభునికి ఇచ్చెదను. సునీథుఁడు ఏకగోత్రుఁ డగుటచేత ఈమెను ఈయఁ దగదు. సూర్యప్రభుఁడు ఇతనికి రాజజన్మములో కుమారుఁడు గాని అసురజన్మములోఁ గాఁడు. కనుక ఆకుమారునికి సమ్మానము చేసిన అది తండ్రికి సమ్మానమగును.' తండ్రి యిట్లు పలుకఁగా నీగుణములు లాగఁగా ఈమె నిన్నుఁ జూడఁ గోరి వచ్చినది." సఖి యిట్లు పలుకుచుండఁగా సూర్యప్రభుఁడు కళావతియొక్క యభిప్రాయమును తెలియఁగోరినవాఁడై కపటనిద్రను పాటించి యుండెను. అంత నాకన్య మేలుకొని యున్న ప్రహస్తునియొద్దకు పోయి సఖీముఖముగా సర్వము అతనికి తెలిపి వెడలి పోయెను.

ప్రహస్తుఁడు వచ్చి సూర్యప్రభుని 'దేవా, మేలుకొని యున్నావా లేదా?' అని యడిగెను. 'మిత్త్రమా, మేలుకొనియే యున్నాను. ఏకాకి నయిన నాకు ఇప్పుడు నిద్ర యెక్కడిది? విశేష మొకటి చెప్పెదను. నీయొద్ద దాఁపవలసినది నా