పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/827

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
జానల్పన

గీ. తనదుపయనంబుసాగింపఁదలఁచియతఁడు,
     వారువపుఁబల్లమునొకింతచేరతడవ,
     వెనుకవంఖాఖూ దలద్రిప్పి కనియెనపుడు,
     మూవుర, సరకుఁగొనలోనఁబోవువారి.
గీ. కాలయాపనమగుటకుఁజాలచింత,
     గదిరియును, సొమ్మచనుటంతన్నఁదన్నుఁ
     జింతనొందించునని తనచి త్తమందు,
     నెఱుఁగుఁగావున, దిగివచ్చినింటికతఁడు.
గీ. చాలసేపటిదాఁకను, సరకుఁగొనెడు,
     వారిమదికీఁ గుదురయ్యె బేర మపుడు;
     ద్రాక్షసారాయిమఱయెతరలిరంచు,
     నరచుచునుమేడదిగివచ్చెనబలయేర్తు.
గీ. "అయ్యయే! యెంతమఱపయ్యె! నయిననేమి ?
     లెమ్ము నాకడకది; సాధకమ్ముచేయు
     నపుడు క త్తినివేసెడు నట్టినడుము
     పటకయున్నదిలే" యని పలికె నతఁడు.
గీ. శ్రద్ధ కలయి యాతనిచాన, తనకుఁ,
     బ్రాణపద మైనసారాయి పట్టుటకును
     రాతిజాడీల రెంటి జాగ్రత్తచేసి
     భద్రముగ దానివానిలోపలనుబోసె.
గీ. ఉండె బుడ్డిబుడ్డికి నొక్క యుంగ్రపుఁజెవి,
     దానిలోనుండి తనపటకాను దూర్చి,
     రెండుప్రక్కలఁ దూఁకంబు నిడియుండఁ
     బ్రక్క కొక్కటి వ్రేలాడఁబడఁగఁ గట్టె.
గీ. అంతయును గానరాకుండ, నడుగుమెుదలు,
     శిరసువఱకునువలువఁగై నేసికొనఁగ