రాజశేఖర చరిత్రము
ఱును మాచిన్నదానికిఁ బట్టినగ్రహమును వదిలించుట యసాధ్యమని విడిచిపెట్టినారు. అతడు మూడుదినములు జల మభిమంత్రించి లోపలికిచ్చి రక్షరేకు కట్టీనాఁడు. నాఁటినుండియు పిల్లది సుఖముగా నున్నది.
రాజ ----మాచెల్లెలు సుబ్బమ్మకు దేహ మస్వస్తముగనున్నది. మనగ్రామములో నెవ్వరును మంచివైద్యులు కనఁబడరు. నాకేమి చేయుటకును తోఁచకున్నది.
రాఘ----బైరాగిచేత మం దిప్పించరాదా! అతడు మీరు సోమ్మిచ్చిన మాత్రము పుచ్చుకొనఁడు ; ఈయూర నెందఱికో ధర్మా ర్ద్దముగానే యౌషధములిచ్చి దీర్ఘ వ్యాధులను సహితము కుదిర్చినాఁడు.
రాజ----గట్టీవాఁ డయినయెడల నీ వాతని నొక్కపర్యాయము మధ్యాహ్నము మాయింటికి వెంటబెట్టుకోనివచ్చి సుబ్బమ్మను చూపెదవా ? నాలుగుదినములనుండి దానిశరీరములో రుగ్మతగా నున్నందున వంటకు మిక్కిలి యిబ్బందిపడు చున్నాము.
రాఘ----అవశ్యముగా దిపికొనివచ్చెదను. అతని కాభేషజములు లేవు. ఎవరుపిలిచినను వచ్చును.
సిద్ధాంతి----ఆతనిజడ స్వర్ణముఖీవిద్య కలదని చెప్పుచున్నారు. మహానుభావులు గోసాయీలలో నెటువంటివారైనను నుందురు.
రాఘ----ఆతఁడు ప్రతిదినమును దమ్మిడియెత్తు రాగి కరఁగి బంగారముచేయునఁట ! ఆతఁ డప్పుడప్పుడు బ్రాహ్మణులకు దాన ధర్మములు చేయుచున్నాఁడు. ఈవిద్యయే లేకపోయిన నాతనికి ధన మెక్కడనుండి వచ్చును ?
రాజ----రాఘవాచారీ ! దేవున కధ్యయణనోత్సవములు శ్రమ ముగా జరుగుచున్నవా ?.