పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/682

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము

సీ. భీష్ముఁడు లోనైన పేరెన్నికను గన్న
మగఁటిమి గలవారు ఁమందుతయును
గర్ణుఁడు మెుదలుగాఁగలుగు సంగడికాండ్రు
పేరులేకుండంగ బిద్దుటయును
దుస్స సేనుఁడు మెుదల్ తోడునీడగనుండు
తమ్ములందఱుఁ బోరనమ్మగుటయు
శల్యుఁడు మున్నుగా సాయంబుచూసపిన
దొరలెల్లనుసుఱులు తొఱఁగుటయును

జూచిదుర్యోధనుఁడు వెఱసొచ్చి నొచ్చి
బడలిద్వైపాయనంబను మడుఁగుచొచ్చి
యెవ్వరు నెఱుంగకుండంగ నేకతంబ
నీరిలో డాఁగియుండెను నిలువరముగ.

క. అప్పుడు పొండునికొడుకులు
తప్పక పగవారినెల్లఁ దలలుదఱిగి తా
మెప్పట్టున దొరఁ గానక
యప్పుడ వెదకంగ ఁ జొచ్చిరండూణూ నిందున్.

తే. ఒకటఁ గృపుఁడు నశ్వత్ధామయుఁ గృతవర్మ
తప్పిచనిఱేఁడు మడువులో దాగియుంట
యెఱిఁగి మువ్వురు నచ్చోటి కేగి తమ్ముఁ
దెలిపికొని మాటలాడిరి తెలివిదప్పి.

క. పడంముడికిని సంజుడు దె
చ్చెడు మెగముల వేఁటకాఱు చెచ్చెర దానిం
బొడగని వచ్చి యుధిష్ఠిరు
కడ జెప్పిరి తామువిన్న కన్నవిన్న కన్నవియెల్లన్.