పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

క.కని యపు డశ్వత్థామయు
దవతేరును శల్యుమనిచి దవ్వుగ గొనిపో
యెను మఱియొక యరదంబును
గొనిశల్యుడు మరలివచ్చి గోరముగాగ.

క.కయ్యఖ్బొనరిచి క్రీడిని
డయ్యంగాజేసి భీము డాసి కలంచెన్
జయ్యన యుధిష్టిరు డడరి
వెయ్యేటికి పత్తిచేత వెసదలద్రుంచెన్.

తే.శల్యు డీల్లిన నెవ్వగ జాలగనలి
చుట్ట్టు ముట్టిరి యాదిట్టచుట్టలెల్ల
వడముడియు గ్రీడి సాత్యకి యడరి వారి
రూపుమాపిరి రారాజు రోసిచూడ.

అ.దుర్విషుండు మొదలు దుర్యోధనుని తమ్ము
లను గడంకదాకి లావుమెఱయ
నొక్కడైన మిగులకుండంగ వందఱ
భీము డపుడు వెదకీ పిలుతుమార్చె.

క.శకునికొమారు నులూకుని
మొకమోటము లేక చంపె మొనలు దలంక
జికిలి మెఱుగు నారపమున
నొకయేటునను సహదేవు డుడుగని కడిమి.

అ.కొడుకుపడిన శకుని మిడుకుచు వడతెంచి
వారువములదండు బలసిరాగ
నకులు బిదిని వాడినారవమ్ముల్లు గ్రుచ్చి
తుదకు దాని పెద్దనిద్దురవోయె.