శుద్ధాంధ్రభారతసంగ్రహము
దుస్ససేనుని భీముండు తొడరితాఁకి
నేలఁబడవైచిఱొమ్మునఁగాలుమోపి
పయిని గూరుండి పొట్టును వ్రచ్చికినుక
నెత్రుద్రావెను నెల్లరునిలిచిచూడ.
తే. అంత దుర్యోధనునిచెంత కరుగుదెంచి
హితపుగఱపె నశ్శత్థామ యెఱుక మెఱయఁ
గర్ణుఁడర్జునుఁబరిమార్పఁగలఁడటంట
వెఱియని తెల్పియికఁబొందువేఁడుమనుచు.
క. దానికి నాతం డీకొన
కొనని యా మంచిమాట లాలింప బల్
వూనికిఁబరిఁబురికొల్పెను
మానక మార్తురదడంబుమాఱుకొనంగన్.
మహాస్రగ్థర
ఒగివివ్వచ్చుండుఁగర్ణుం డొకరినొకరితామోర్చిమించంగనానం
దగఁబోరాటంబు సల్పం దఱుఁగని బలిమిం దద్దయున్మేలుచేయై
పగవాని న్నొంచిచాలం బడలు పఱచిక్రొవ్వాడితూపుల్మెఱుంగుల్
నిగుడంగామేన నెల్ల న్నెఱఁ కులుదవులన్నేర్పుతో౯గ్రీడినాటెన్.
క. అది గని దుర్యోధనుఁడవు
డెదిరింపఁగఁ జేయినీచె నెల్లరఁగ్రీడిన్
సదమదము చేసెఁ బలువుర
నెదిరింపఁగఁ జన్నవారి నీసున నతఁడు౯.
తే. వేలుపులఱేఁడు తనకియ్యవెలయుదానిఁ
బెక్కు నాళులనుండియుమిక్కిలిగను
గొలుచుచుండెడుదానిఁబెంజిలువతూవు
నర్జునునిమీఁద నాకర్ణుఁడలుకనేసె.