పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/673

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయా శ్వాసము


క.అమ్ములు మఱియుం బఱపుచు
దమ్మయి యవియెల్లఁ బోవ వగఁగూరినడెం
దమ్మున నశ్వత్థామయుఁ
గ్రమ్మఱెఁ జేయునది లేక గరువంబడఁగ౯. 104

ఆ.అంతఁ బ్రొద్దుగ్రుంక నాలంబు చాలించి
యలరి గొంతికొడుకు లగిరి రెండ్ల
కలుక ద్రోణుచావుఁ దలఁచి దుర్యోధనుఁ
డడలు చిల్లునేరెనపుడ వెడలి. 105

క. అమ్మఱుసటినాఁడొక్కటఁ
దమ్ములయు దొరలయు నెదుటదళవాయినిగా
నమ్మిన కర్ణుని నొనరించి
క్రమ్మఱ దుర్యోధనుండు కలనికి వెడలెన్. 106
 
క. పదియాఱవనాఁ డటువలేఁ
బొదలుచు నిరువాఁగుఁ దాఁకి పోరాడంగా
సదమదము చేసె వడముడి
యదనారసి క్షేమధూర్తి యను నెకిమీనిన్. 107

క. వడముడి యశ్వత్ధామయుఁ
చడవు పెనఁగి సొమ్మసిలిరి తగ నిరువురు న
ప్పుడ కర్ణుండును నకులునిఁ
గడఁక యుడిపి తేరు చదిపి కాఱులుప్రేలెన్. 108

తే. దుస్ససేనుండు సహదేవుడుతోడఁ బెనఁగి
సొమ్మవోయెనుదనవారలుమ్మలింపఁ
గృపునిఁ దాఁకి ధృష్టద్యుమ్నుఁడపిడుపోరి
యేడిపాఱెనునవ్వంగఁదోడివారు, 109