పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము


నప్పుడశ్వత్ధామ యనుగౌరు చచ్చుట
నెపముగా భీముండు నేర్పుమెఱయ
ద్రోణునికడకేగి దోరె నశ్వత్ధామ
యనిచెప్పి వినఁడయ్య నతని పలుకు
లంతఁ జెప్పె యుధిష్ఠిరుఁ డళుకు దక్కి
పోర నిప్పుడశ్వత్ధామ పొలిసెననుచు
నమ్మి ద్రోణుండు తేరిపై సొమ్మసిల్లి,
విల్లునమ్ములుఁ గ్రిందను విడిచి పడియె. 101

క. పీనుఁగునవలెఁ బడి యుండీన
       వానిందలద్రుంచి వైచె వాలుననలుక౯
      మానక ధ్రష్టద్యుమ్నుఁడు
      తానే యాతనినిజంపఁ దగువాఁడనుచు౯. 102

సీ. ఎవరు చెప్పినవిన కేచి థ్రష్టద్యుమ్నుఁ
డటుతండ్రిఁ బఱచుట యాలకించి
కినుక నశ్వత్ధామ చనుదెంచి యాకూళ
నిప్పుడెకని పొలియింతు ననుచుఁ
బలికుచు దళముల పై దూపు లడరించి
నారాయణంబను పేరుగలుగు
గోరంపుటామ్మును గొబ్బున విడిచినఁ
బలువుర నది నేలపాలు చేసె
 
దాని వేడిమి కెవ్వరుఁ దాళలేక,
కలఁతనిందొంగ వెన్నుండు కనికరమున
వడముడిని దేరుడిగఁబంచి యుడి పెదాని,
వాడియంతయుఁదననేర్పువన్నెకుక్క. 103