పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/669

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

మ. చనుచున్ భీముఁడుత్రోవలో బలిమిమైఁజక్కాడె శత్రుంజయు
డునులోనౌ ధృతరాష్టుపట్టులను నెంతో కిస్కఁగర్ణుండు భీ
ము వనిన్ లోఁగొని తిండిపోతనుచు నేమో యుల్లసంబాడి పు
చ్చిన వివ్వచ్చుఁడువచ్చి పోతర మడంచెంగర్ణునాలంబునన్.ఇంద్రవజ్రము.


భూరిశ్రవున్మార్కొని పోరిడయ్య౯,
గోరంబుగాసాత్యకిఁగూల్చినేలన్
దోరింపఁజేయెత్తుడు దొడ్డయమ్ము౯,
సారించినివ్వచ్చుఁడు జానుమీఱ౯.

తే. త్రుంచెభూరిశ్రవునిచేయిత్రుళ్ళిపడఁగ,
నంతఁగృష్ణునితమ్ముండునంసమున
లేచియడిదంబుపూనిచేసాఁచియతని,
తలనుదునుమాడె నెల్లరువలదనంగ.

తే.మరలఁగర్ణుండుసాత్యకిమాఱుకొంచు,
వేలుపులుమెచ్చునట్లుగఁబెనఁగితడవు
పొలిచియాతని దాడికినికువలేక,
పాఱిపోయెను బగవారు మీఱినవ్వు.

సీ.పదవడిసాత్యకి వడముడియును దోడ
నరుదేర నలుకమై నర్జునుండు
           సైంధవుదెసకును జాఁగి వేగముపోవ
రారాజుపంపున రాధకొడుకు
          కవ్వడికడంబుగా వచ్చి పోరాడి
యొడలునొచ్చిన సిగ్గువిడిచిపాఱెఁ
          గృపుఁడునశ్వత్థామ వృషసేనుఁడునుశల్యుఁ
డడరి పోరిరి క్రీడియౌననంగ