పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/666

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

</poem>గడఁగియశ్వత్థామకరవాలునుఱుమాడె

నాటెశల్యుఁడుమేననారసముల

మఱిచేయఁగలదండిమగలెల్లదొమ్మిని

బయిఁబడియలయింపఁబాలుపడిరి

యేమిచెప్పుదునభిమన్యుఁడేవుచెడక మేనునెత్తుటజొత్తిల్లిమింటికెగసి దుస్ససేనునికొమరునిఁదొడరివాని గీటడంచియునతనిచేఁగెడసెఁదాను.

ఆ.అంతఁబ్రొద్దుగ్రుంకనాలంబుచాలించి మొనలఁదివిచికొంచుమొగమునందు విన్నఁదనముతోఁపవెసవీటికినిబోయె జమునిపట్టికొందలమునమునిఁగి.

క.కవ్వడియువచ్చికొమరుడు చివ్వనుగడతేఱుటన్నచెప్పగవినిలో నెవ్వగఁబొగులుచునడలెను నెవ్వారాఁపిననునాఁగకెలుఁగెత్తివడి౯.

ఉ.అంతటఁగొంతసేపటికినాతఁడునెంజిలివాసియిట్లనుం బంతముచూడుఁడెల్లిపరిమార్చెదసైంధవునేరుగాచిన౯ బొంతలఁబ్రొద్దుగ్రుంకుటకుమున్నుగనందఱుఁజూచుచుండనే నంతయుఁజేయలేనియెడనగ్గినిచొచ్చెదగాండివంబుతో౯.

క.అనిప్రతినపట్టెనంతయు వినిమదిలోసైంధవుండువెఱపైకొనగాఁ జని దుర్యోధనునకుఁ దెలి పిననాతడు దిటము చెప్పి వెఱవుడిగించెన్.

వ. అట్లారేయి కడచిన.</poem>