పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/664

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము


ఆ.అంతఁబ్రొద్దుగ్రుంకెనప్పుడయురువాఁగు
నెలవుపట్లకేగినిదురపోయి
మరలనెప్పటట్లమఱునాఁడుచనుదెంచి
కలనికాయితమయినిలిచిరందు.

సీ.సంశప్తకులుక్రీడిజగడంబునకుఁబిల్చి
దవ్వుగఁగొనిపోయితడవుపెనఁగి
రీలోనద్రోణుండునిచ్చటఁదమ్మిమొ
గ్గరమునుబన్నించికిడిమిమెఱయ
పడముడిలోనైనవారెల్లదానిని
జింపంగనేమియుఁజేతఁగాక
యభిమన్యువేఁడిననాతండుగండున
ద్రోణునిఁదూపులఁద్రాణచెఱచి
మెహరంబునుజొచ్చియమ్మొనలనెల్ల
జిక్కువఱచుచుఁబెక్కురనుక్కడంచి
నేలకునుగోలకునుదెచ్చెనేర్పుమెఱసి
పగఱజోదులనెల్లనుబలియుఁడగుచు.

మఱియుంబోవకతాఁకినట్టికృపునిన్మాఱేసిదుర్యోధను౯
నెఱఁకుల్ దూఱఁగఁగొట్టిద్రోణుకొడుకుంనిట్టేసిదుశ్శాసనుం
బఱవం జేసివెసన్ బృహద్బులునిచేవం బాపియాకర్ణుని౯
గొఱవోవం గనునేసిశల్యుకడిమిం గోల్పుచ్చెబీరంబునన్.

క.ఈలోనభిమన్యునకును
వాలములోఁదోడునూపనరిగెడిభీము౯
మేలిమగలఁబోనీయక
చాలికనెదిరించియాఁపె సైంధవుఁడొకఁడున్.