పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/659

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వీతీయాశ్వాసము

     మెచ్చుల్గుల్కఁగఁ గట్టి తేరు డిగి యామిన్నేటిపట్ట్టిం బొరిం
     బుచ్చం గా నడతెంచెఁ గేల బలితంపుఁ జుట్టువాలొప్పఁగన్.

క. తోడనెపఱతెంచి వడిం
     గ్రీడియునిరుగేలఁ బట్టి కృఝ్ణని మరలం
     దోడుకొనిపోయి తేరున
     వేడుకఁ గూర్చుండఁబెట్టె వేఁడుచుబలిమిన్.

క. తియ్యనిమాటల వెన్నుని
     నియ్యకొనంజేసి వెడలి యీరసమెసఁగం
     గయ్యమునకు డాసెనపుడె
     యొయ్యనఁ బ్రొద్దత్తమిల్లె నుడిగెదురుంబు౯.

తే. నాఁటిబవరంబుఁగని మదినాటుకొన్న
     యుమ్మలమ్ముననింకఁ గయ్యమ్ముమాని
     కానలకు నేగుదునటంచుఁగెడఁకఁబలుకు
     నలయుధిష్ఠిరు నూఱార్చియబుపుమీఱ.

క.వెన్నుండారే యాతని
     విన్నేటికొమారుడకకు వివ్వచ్చునితోఁ
     దిన్నఁగగొని చనియాయన
     సన్నగ నడిగించె: జావుచందముఁ దెలుపన్.

ఉ. అందున కాతఁడిట్ట్టనియె నాఁడుఁదనంబును దొల్తఁదాల్చి యా
     పొందికఁబాసి వెనమగపోడిమిఁ దాలిచియున్న వారిపై
     నెందును నేయకుందుననియేఁ బ్రతినందగఁ బట్టినాఁడ మీ
     యందుశిఖండి యట్టిఁడగు టాతని ముందిడికొంచు నాపయి౯.

క. నేనేయనితఱిఁ గవ్వడి
     నోనేసినఁ గూలువాఁడ నునుఁదూపులచేఁ
     జూనియటుచేయుఁ డంచును
     నానతియిడి పంచె మంతనంబున వారిన్.