పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/655

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము


ద్రోవది ంకొడుకులు తోడుగ నభిమన్యుం
డడరి యొప్పనివారి కడఁకజెఱిచెర
గృఅపుఁడు నశ్వత్ధామ కేడించి మూఁకల
పై ఁ బడి తమలాఅవు బయలుపఱిచి
రుత్తరుండేగి శల్యునిమీఁదఁ బోటొగ్గి
రూపఱె నాతని తూపుగములు
 
నంతభీష్ముండుగ విసివాలంపగములఁ
దెలుచఁబరఁగించిమూఁకల బెగడువఱిచి
యెల్లెడలఁ దానయైపొల్చి యేపుచూప,
విరిగిసురిఁగిరిపగ వారిబిరుదుమగలు. 24

క. ఆలోచనఁ బ్రొద్దుగ్రుంకిన,
నాలముసాలించి నాఁటి కందఱు వీళ్ళన్
జాలము సేయక చేరిరి,
చాలఁగ విన్నేటికొడుకు సారెఁ బొగడుచు౯. 25

ఉ.రెండవఁనాటి పోరునను రెండ ప్రొద్దుకొమారు పోలికన్
దండిమగండు క్రీడి తన త్రాణనుజూపెఁ గరంబు ఁ బుచ్చె భీ
ముండును భానుమంతు జుముప్రోలికి ద్రోవదితోడఁబుట్టువుం
గండునఁదాఁకి ద్రోణుఁడును గ్రచ్చఱఁ బాఱఁగఁజేసె వీనున౯. 26

సీ. మూఁడవనాఁను మొగ్గరంబులుపన్ని
యిరువాఁగు నొండొంటిబెరసితాఁక
దుర్యోధనుఁడు భీముతోఁ దలపడిపోరి
మేనెఱుంగక తేరిమీఁద సోలె
మూడుజాములయప్పు డీడఁబోవక భీష్ముఁ
డుక్కునఁ బెక్కురఁజక్కడంచి